Employees Prioritize Family : కుటుంబమే ముఖ్యమన్న ఉద్యోగులు.. సర్వేలో వెల్లడి
వారంలో ఎక్కువ గంటలు పని చేయాలన్న దానిపై ఇటీవల కాలంలో చాలా చర్చ జరుగుతోంది. వారానికి 72 గంటల పని చేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి సూచించారు. ఎల్ అండ్ టీ చైర్మన్ మరో అడుగు ముందుకేసి వారానికి 90 గంటల పని గురించి మాట్లాడారు. వీరి అభిప్రాయాలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ఇలాంటి పని గంటలపై ఉద్యోగులు అభిప్రాయాలను సేకరించింది ఓ సంస్థ. సర్వేలో 78 శాతం మంది ఉద్యోగులు తమకు కుటుంబమే ముఖ్యమని తేల్చి చెప్పారు. దీని తరువాతే ఏదైనా అని నిక్కచ్చిగా చెప్పేశారు. ప్యూచర్ కెరీర్ రిజల్యూషన్ రిపోర్ట్ పేరుతో ఈ సర్వే నివేదికను జాబ్ సైట్ ఇండీడ్ విడుదల చేసింది.