తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సుకు విద్యుత్ వైర్లు తగిలి ఫుట్బోర్డుపై ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తంజావూరు జిల్లా తిరువూరులో చోటుచేసుకుంది. క్షగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.