కాల్పులకు తెగబడిన పాకిస్థాన్.. బుద్ధి చెప్పిన భారత్

పాకిస్తాన్ సైనికులు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు.

Update: 2020-09-29 04:52 GMT

పాకిస్తాన్ సైనికులు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. జమ్మూకశ్మీరులోని పూంచ్ జిల్లా మాన్ కోటి సెక్టారులో సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద మంగళవారం ఉదయం కాల్పులకు దిగారు. చిన్న ఆయుధాలు, షెల్లింగులు, మోర్టార్లతో కాల్పులకు తెగబడ్డారని భారత రక్షణ వర్గాలు తెలిపారు. దీంతో భారత సైనికులు అప్రమత్తమై పాక్ సైనికుల కాల్పులను తిప్పికొట్టారని అన్నారు. భారత్ సైనికులు రంగంలోకి దిగడంతో పాక్ సైనికులు తోక ముడిచారు.  

Similar News