Dost registrations : నేటి నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు

Update: 2024-05-06 08:51 GMT

డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నేడు ప్రారంభం కానుంది. ఈనెల 25 వరకు మొదటి విడత ప్రక్రియను చేపట్టనుండగా, విద్యార్థులు రూ.200 చెల్లించి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈసారి దోస్త్ యాప్‌లో సెల్ఫీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. ఈనెల 15 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. జూన్ 3న సీట్లను కేటాయిస్తారు.

రూ. 200తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. జూన్ 3 న తొలి విడత సీట్ అలాట్ మెంట్ ఉంటుంది. జూన్ 4 వ తేదీ నుంచి 10 లోపు కాలేజీలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. రెండో దశ రిజిస్ట్రేషన్ జూన్ 4 నుంచి 13 వరకు కొనసాగనుండగా.. దీనికి రూ. 400 తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మూడో దశ జూన్ 19 నుంచి 25 వరకు రిజిస్ట్రేషన్ కు అవకాశం ఉంది. రెండో దశలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి జూన్ 18 న సీట్ల కేటాయింపు ఉంటుంది.

రాష్ట్రంలోని 1066 కాలేజీల్లో మొత్తం 4,49,449 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మూడు విడతల్లో దోస్త్‌ ప్రక్రియను పూర్తిచేస్తారు.

Tags:    

Similar News