Telangana 10th Supplementary Exams : తెలంగాణలో జూన్ 3 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు
తెలంగాణలో జూన్ 3 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు వీటిని నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 35 కేంద్రాల్లో 12,186మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్..
జూన్ 3వ తేదీన తెలుగు, ఫస్ట్ ల్యాంగ్వేజ్లో కాంపోజిట్ కోర్సు-1, కాంపోజిట్ కోర్సు-2 పరీక్షలు
జూన్ 5వ తేదీన సెకండ్ ల్యాంగ్వేజ్
జూన్ 6వ తేదీన ఇంగ్లిష్
జూన్ 7వ తేదీన గణితం
జూన్ 8వ తేదీన భౌతికశాస్త్రం
జూన్ 10వ తేదీన జీవశాస్త్రం
జూన్ 11వ తేదీన సాంఘికశాస్త్రం
జూన్ 12వ తేదీన ఓఎస్ఎస్సీ ప్రధాన భాష (సంస్కృతం, అరబిక్) పేపర్-1
జూన్ 13వ తేదీన ఓఎస్ఎస్సీ ప్రధాన భాష (సంస్కృతం, అరబిక్) పేపర్-2 పరీక్షలు