Maharashtra : మహారాష్ట్రలోని మాలెగావ్లో ఓ మైనర్ బాలుడు తాను కూర్చున్న బాంకెట్ హాల్లోకి చిరుతపులి ప్రవేశించడంతో తృటిలో తప్పించుకున్నాడు. 12 ఏళ్ల ఈ బాలుడు మొబైల్ ఫోన్లో గేమ్ ఆడుతుండగా, హాల్ మెయిన్ డోర్ తెరిచి ఉండగా ఈ ఘటన జరిగింది. చిరుతపులి గదిలోకి రావడాన్ని గమనించిన బాలుడు వెంటనే బయటకు వెళ్లి తలుపులు వేశాడు.
మైనర్ అప్రమత్తం చేయడంతో స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని అటవీశాఖకు సమాచారం అందించారు. అనంతరం స్థానిక పోలీసులు, అటవీశాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని చిరుతను శాంతింపజేశారు. తర్వాత దాన్ని బోనులో బంధించారు.
ఘటన అనంతరం బాలుడు విలేకరులతో మాట్లాడుతూ, చిరుతపులి ప్రవేశించినప్పుడు తాను బాంక్వెట్ హాల్ తలుపు దగ్గర కూర్చున్నానని చెప్పాడు. ఆ తర్వాత అతను హాలు డోర్ వేసి, ఇంటికి వెళ్లి తన తండ్రికి విషయం తెలియజేశాడని చెప్పాడు.