రాజస్థాన్లోని (Rajasthan) జైపూర్లో (Jaipur) ఆరు గ్యాస్ సిలిండర్లు పేలడంతో ఒకరు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన జైపూర్లోని విద్యాధర్ నగర్ మందిర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పేలుడు ధాటికి స్థానికుల్లో కూడా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటన మార్చి 4న జరిగింది.
ఈ సంఘటనకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. ఇవి భవనం నుండి తీవ్రమైన మంటలు చెలరేగడం, చుట్టుపక్కల ప్రాంతాన్ని చుట్టుముట్టిన దట్టమైన పొగను చూపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
జోధ్పూర్కు 110 కిలోమీటర్ల దూరంలోని షేర్గఢ్ తహసీల్లోని భుంగ్రా గ్రామంలో పెళ్లికి అతిథులు వచ్చిన ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడు ధాటికి ఇల్లు కూలిపోయింది. వరుడి ఇంట్లో అతిథుల కోసం ఆహారం సిద్ధం చేస్తుండగా స్టోర్ రూంలో ఉంచిన వంటగ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో మంటలు చెలరేగి పేలిపోయింది. పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు రాజస్థాన్ ప్రభుత్వం రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా, గాయపడిన వారికి రూ. లక్ష ఆర్థిక సాయం ప్రకటించింది.