పంజాబ్ లో మంత్రి రవ్జోత్ సింగ్ ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు వైరల్ గా మారాయి. శిరోమణి అకాలీదళ్ నేత బిక్రమ్ సింగ్ మజిథియా వాటిని ఎక్స్ లో పోస్ట్ చేశారు. రవ్జోత్ను పదవి నుంచి వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా ఆ ఫొటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సృష్టించిన ఫొటోలని మంత్రి రవ్జోత్ కొట్టి పారేశారు. అలాంటి ఫొటోలను పోస్టు చేసిన విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసి చట్టపరంగా ముందుకు వెళ్తానని మీడియా సమావేశంలో వెల్లడించారు.