మహారాష్ట్రలోని (Maharahstra) అమరావతి స్థానం నుంచి 2019 లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నవనీత్ రాణా, రాబోయే ఎన్నికల్లో అమరావతి నుంచి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నుంచి బరిలోకి దిగారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నవనీత్ రాణా కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసి విఫలమయ్యారు. 2019లో, రానా ఇండిపెండెంట్ అభ్యర్థిగా అమరావతి నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతుతో శివసేనను ఓడించారు.
ఆమె శివసేన అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి ఆనందరావు అద్సుల్పై విజయం సాధించారు. అమరావతితో పాటు, కాషాయ పార్టీ తన ఎనిమిదో జాబితాలో కర్ణాటకలోని చిత్రదుర్గ స్థానం నుండి గోవింద్ కార్జోల్ను ప్రకటించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో చిత్రదుర్గ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ నేత ఎ నారాయణస్వామి విజయం సాధించారు.
హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చేత ఖాళీ అయిన కర్నాల్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక కోసం పార్టీ హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీని కూడా రంగంలోకి దించింది. ఖట్టర్ తర్వాత సైనీ ఈ నెల ప్రారంభంలో హర్యానా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు 10 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను కూడా బీజేపీ విడుదల చేసింది.