రాజ్తరుణ్ హీరోయిన్కి లక్కీ ఛాన్స్..!
రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఉయ్యాల జంపాల సినిమాలో అవికా గోర్ చిన్నప్పటి పాత్రలో నటించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ప్రణవి మనుకొండ..
రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఉయ్యాల జంపాల సినిమాలో అవికా గోర్ చిన్నప్పటి పాత్రలో నటించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ప్రణవి మనుకొండ.. ఆ తరవాత పలు సీరియళ్లలో కూడా నటించింది. సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన ప్రతి రోజూ పండగే చిత్రంలో రాశిఖన్నా చెల్లలుగా నటించింది. కాగా ప్రస్తుతం హీరోయిన్ గా టర్న్ అవుతుంది. బిగ్ బాస్ ఫేం మెహబూబ్ హీరోగా వస్తున్న గుంటూరు మిర్చిలో హీరోయిన్ గా ప్రణవి మనుకొండ ఎంపికైంది. రితిక చక్రవర్తి మరో హీరోయిన్ గా నటిస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.