ముంబైలోని ప్రముఖ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం ముంబై నారిమన్ పాయింట్లోని ట్రైడెంట్ హోటల్ పైఅంతస్తు నుంచి పొగలు వచ్చాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హోటల్ దగ్గర చేరుకొని మంటలను నియంత్రించారు. హోటల్ సిబ్బంది కూడా రంగంలోకి దిగి ఫైర్ సిబ్బందికి సహాయం చేశారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. అయితే తమకు హాటల్ నుంచి ఎలాంటి సమాచారం అందలేదని ముంబై మున్సిపాలిటి అధికారులు తెలిపారు.