టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, జగన్పై ఫైర్ అయ్యారు. ప్రజల డబ్బులు దొంగతనం చేసి, జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. హాఫ్ టికెట్ సీఎం చాలాకాలం తర్వాత బయటికి వచ్చారంటూ ఎద్దేవా చేసారు. బాలకృష్ణ తల్లి క్యాన్సర్తో చనిపోతే, తల్లుల కోసం క్యాన్సర్ ఆస్పత్రి పెట్టిన ఘనత బాలకృష్ణది అన్నారు. మీ తల్లి, చెల్లి ప్రాణ భయంతో హైదరాబాద్లో, దాక్కొన్నారని విమర్శించారు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి. నీచాతినీచంగా మాట్లాడిన అంబటి గురించి, అనీల్ గురించి మాట్లాడమన్నారు.