TDP: మహాశక్తి పథకం ప్రారంభం..

Update: 2023-07-14 09:30 GMT

మహానాడులో ప్రకటించిన మేనిఫెస్టోలో భాగంగా మంగళగిరి టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు చంద్రబాబు మహాశక్తి పథకాన్ని ప్రారంభించన్నారు. ఇందుకోసం పెద్ద సంఖ్యలో మహిళలు పార్టీ ఆఫీస్‌కు చేరుకుంటున్నారు. జగ్గంపేట నియోజకవర్గం నుండి తెలుగు మహిళల తరలి వెళ్లారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ జెండాను ఊపి ప్రారంభించారు.టీడీపీ మహిళలకు పెద్దపీట వేస్తోందన్నారు జ్యోతుల నెహ్రు. మహాశక్తి పథకం, మహిళలకు ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం వంటి పథకాలతో దూసుకెళ్తోందన్నారు. మహాశక్తి పథకం ప్రారంభానికి మహిళా నేతలంతా పాల్గొంటారన్నారాయన. 

Tags:    

Similar News