పారిస్ ఒలింపిక్స్లో భారత్ ఖాతాలో రెండో పతకం చేరింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో సరబ్జోత్ సింగ్, మను బాకర్ జోడీ పతకాన్ని గెలిచింది. దక్షిణ కొరియా జోడీపై16 -10 తేడాతో గెలిపొంది కాంస్య పతకం సాధించింది. మనుబాకర్ జోడి 16 పాయింట్లు సాధించగా.. దక్షిణ కొరియా జోడి 10 పాయింట్లకే పరిమితమైంది. ఒకే ఒలింపిక్స్ సీజన్లో రెండు పతకాలతో మనుబాకర్ రికార్డు సృష్టించింది.