ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)కొత్త చైర్మన్గా జై షా ఎన్నికయ్యారు. బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న ఆయన.. ఈ ఎన్నికలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిసెంబర్ 1 నుంచి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించనున్నారు.ప్రస్తుతం చైర్మన్గా గ్రెగ్ బార్క్లే కొనసాగుతున్నారు. అతడు మరో దఫా ఛైర్మన్గా కొనసాగడానికి అర్హత ఉన్నా.. కొనసాగడానికి విముఖత చూపారు. దీంతో జై షా ఎన్నిక ఏకగ్రీవమైంది.