ఆస్ట్రేలియా విధ్వంసర ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ (Maxwell) లేటు వయసులోనూ రెచ్చిపోతున్నాడు. 35 ఏళ్ల మాక్స్వెల్ అడిలైడ్లో 2024 ఫిబ్రవరి 24న వెస్టిండీస్తో జరిగిన మూడో టీ 20 మ్యాచ్లో 55 బంతుల్లో 120 పరుగులు చేశాడు. ఇందులో 8 సిక్స్లు,12 ఫోర్లు ఉన్నాయి. ఈ సెంచరీతో టీ20 ల్లో అత్యధిక సెంచరీలు చేసిన రోహిత్ శర్మ(5) (Rohit sharma) రికార్డును సమం చేశాడు.
రోహిత్ శర్మ 151 మ్యాచ్ల్లో 31.79 సగటు, 139.97 స్ట్రైక్ రేట్తో 5 సెంచరీలు, 29 అర్ధ సెంచరీలు చేస్తే, గ్లెన్ మ్యాక్స్వెల్ 102 మ్యాచుల్లో 30.83 సగటు, 155.26 స్ట్రైక్ రేట్తో 2405 పరుగులు చేశాడు. ఇందులోల ఐదు సెంచరీలు, 10 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇక ఈ లిస్ట్లో టీమ్ఇండియా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నాడు. అతడు 57 ఇన్నింగ్స్లో నాలుగు సెంచరీలు చేసి రెండో స్థానాన్ని చేజిక్కించుకున్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదట ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 4 వికెట్లకు 241 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో విండీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 207 రన్స్ చేసింది. పరుగుల వరద పారిన ఈ పోరులో ఆసీస్ 34 పరుగుల తేడాతో విండీస్ను చిత్తుచేసి వెస్టిండీస్పై టీ20 సిరీస్ ను దక్కించుకుంది.
టీ20 క్రికెట్ అత్యధిక సెంచరీ వీరులు
1. రోహిత్ శర్మ- 5 (143 మ్యాచ్ లు)
1. గ్లెన్ మ్యాక్స్ వెల్- 5 (94 మ్యాచ్ లు)
2. సూర్యకుమార్ యాదవ్- 4 (57 మ్యాచ్ లు)
3. బాబర్ అజామ్- 3 (103 మ్యాచ్ లు)
4. కొలిన్ మన్రో-3 (62 మ్యాచ్ లు)