Ind vs Eng : జైస్వాల్ మెరుపు సెంచరీ.. భారీ స్కోర్ దిశగా టీమ్ ఇండియా

Update: 2024-02-17 11:31 GMT

రాజ్ కోట్ (Rajkot) వేదికగా ఇంగ్లండ్ (England) తో జరుగుతున్న మూడో టెస్టులో యశస్వి జైస్వాల్ (Yashaswi Jaiswal) మెరుపు శతకం సాధించారు. కేవలం 122 బంతుల్లోనే 9 ఫోర్లు 5 సిక్సర్లతో 100 రన్స్ చేశారు. హాఫ్ సెంచరీ వరకు నెమ్మదిగా ఆడిన ఈ యంగ్ ఓపెనర్ ఆ తర్వాత ఇంగ్లండ్ బౌలర్లపై మెరుపు దాడి చేశారు. ఇంగ్లండ్‌ సీనియర్‌ పేసర్‌ జెమ్స్‌ అండర్సన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 27వ ఓవర్‌లో చివరి మూడు బంతుల్లో 6, 4, 4 బాది ఒక్కసారిగా గేర్‌ మార్చేశాడు. కాగా జైశ్వాల్‌కు ఇది మూడో టెస్టు సెంచరీ. ఈ సిరీస్‌లో ఇది ముంబైకర్‌కు రెండో సెంచరీ కావడం గమనార్హం. రెండో టెస్టులోనూ అతడు డబుల్ సెంచరీ(209)తో అదరగొట్టారు. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా స్కోరు 46 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 189 పరుగులు. జైస్వాల్ 104 పరుగులతో, శుభ్ మాన్ గిల్ 61 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా ఓవరాల్ ఆధిక్యం 315 పరుగులకు పెరిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ 19 పరుగులు చేసి రూట్ బౌలింగ్ లో అవుటయ్యాడు.

Tags:    

Similar News