ప్లాట్ కొనుగోలు వివాదంలో స్టార్ హీరో ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన 2003లో లక్ష్మీ అనే మహిళ వద్ద జూబ్లీహిల్స్లో ఒక ప్లాట్ కొన్నారు. అయితే.. ఆ ప్లాట్పై ఆమె అప్పటికే లోన్ తీసుకున్న విషయాన్ని దాచిపెట్టారు. కేవలం ఒక్క బ్యాంకులో మాత్రమే మార్ట్ గేజ్ లోన్ ఉన్నట్లు ఎన్టీఆర్ కు చెప్పిందట ఆమె. చెన్నైలో ఒక బ్యాంక్ లో లోన్ క్లియర్ చేసి డాక్యుమెంట్ తీసుకున్నారు తారక్. మిగతా బ్యాంక్ లోన్లు చెల్లించకపోవడంతో.. ఆ ప్లాట్ను స్వాధీనం చేసుకునేందుకు బ్యాంకులు యత్నించాయి.
ఈ నేపథ్యంలో 2019లోనే బ్యాంకు మేనేజర్లపై ఎన్టీఆర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే లో జూనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఆర్డర్ వచ్చింది. దీంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జూనియర్ ఎన్టీఆర్. జూన్ 3 లోపు డీఆర్టీ డాకెట్ ఆర్డర్ సబ్మిట్ చేయమని హై కోర్టు ఆదేశించింది. జూన్ 6న విచారణ చేపడతామన్న హైకోర్టు తెలిపింది.