TS : తెలంగాణలో నేడు, ఎల్లుండి అమిత్ షా ఎన్నికల ప్రచారం

Update: 2024-05-09 04:43 GMT

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ, ఎల్లుండి రాష్ట్రంలో పర్యటించనున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ భువనగిరిలో జరిగే బీజేపీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈనెల 11న ఆయన మరోసారి రాష్ట్రానికి రానున్నారు. ఆ రోజున వికారాబాద్, వనపర్తిలో జరిగే సభల్లో పాల్గొంటారు. మరోవైపు మాజీ గవర్నర్ తమిళిసై నేడు ఆదిలాబాద్‌లో బీజేపీ తరఫున ప్రచారం నిర్వహించనున్నారు.

రేపు తెలంగాణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్నారు. నారాయణపేట, హైదరాబాద్ ఎల్బీ స్టేడియం సభల్లో పాల్గొననున్నారు. ఎల్లుండి మరోసారి తెలంగాణకు బీజేపీ అగ్రనేత అమిత్ షా రానున్నారు. వికారాబాద్, వనపర్తి బహిరంగ సభల్లో అమిత్ షా ప్రసంగించనున్నారు. తెలంగాణలో ఎలాగైనా పెద్ద మొత్తంలో ఎంపీ సీట్లను రాబట్టుకోవాలని బీజేపీ అధిష్టానం పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే ఇప్పటికే పలు మార్లు తెలంగాణకు వచ్చి వెళ్లిన మోదీ, అమిత్‌ షాలు మరోసారి ప్రచారానికి రానున్నారు.

Tags:    

Similar News