Bhadradri District : బట్టలు చింపి దాడి.. భద్రాద్రి జిల్లాలో ఫారెస్ట్ ఆఫీసర్ల జులుం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవైండి గ్రామ పరిధిలో గిరిజనులపై ఫారెస్ట్ అధికారులు దాడి చేశారు. ఒంటిపై బట్టలు చింపి మరీ దాడికి పాల్పడినట్లు గిరిజన మహిళలు ఆరోపించారు. 30 ఏళ్ళుగా సాగు చేసుకుంటున్న పోడు భూమిని లాక్కోవడానికి ఫారెస్ట్ అధికారులు జేసీబీలతో వచ్చి విచక్షణా రహితంగా దాడి చేశారని వారు మండిపడ్డారు. భూములు లాక్కొని అన్యాయం చేయొద్దని వారు వేడుకున్నారు.