దేశానికి దిశానిర్దేశం చేసిన రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. స్వాతంత్య్ర భారతదేశానికి భవిష్యత్ను నిర్దేశించిన స్ఫూర్తిప్రదాత అని కొనియాడారు. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ట్యాంక్బండ్ వద్ద విగ్రహానికి బండి సంజయ్ నివాళులర్పించారు. అంబేడ్కర్ స్ఫూర్తితో... అంత్యోదయ నినాదంతో బీజేపీ పని చేస్తోందని తెలిపారు. బీజేపీ బడుగు, బలహీన వర్గాలకు అవకాశం కల్పిస్తుందని చెప్పారు. అటు... రాష్ట్ర ప్రభుత్వం అంబేడ్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలు వారం పాటు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అంబేడ్కర్కు నివాళులు అర్పించేందుకైనా సీఎం కేసీఆర్ బయటకు రావాలని అన్నారు.