ఇటీవల కురిసిన వడగళ్ల వర్షాల కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీగా పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేప థ్యంలోనే పంట నష్టపోయిన రైతులకు కాంగ్రెస్ సర్కారున్న్యూసచెప్పింది. రాష్ట్రంలో గత రెండు నెలలుగా పలుదఫాలుగా వడగళ్ల వాన, అకాలవ ర్షాలకు పంట నష్టం సంభవించగా సీఎం రేవంత్ ఆదేశాలతో వ్యవసాయ శాఖ అధికారులు రైతు వారీ పంటనష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అం దజేశారు. దాదాపు 29 జిల్లాల్లో 41,361 మంది రైతులకు సంబంధించి 5,528 ఎకరాల్లో పంట నష్టం సంభవించిందని ఆఫీసర్లు అంచనా వేశారు. దీనికి సంబంధించిన రూ. 51.528 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మంజూరు చేసింది. ఈ నిధులను సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకొని త్వరలోనే నష్టపోయిన రైతుల అకౌంట్ల లో జమ చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వరి 36,424 ఎకరాలు, మొక్కజొన్న 3,266, జొన్న 470, ఉద్యాన పంటలు 6,589, ప్రత్తి 4,753 ఎకరాలు, ఇతర పంటలు 477 ఎక రాలలో ప్రాణహిత వరదల మూలంగా సంభవిం చిన నష్టం) పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. అయితే మే నెలలో జరిగిన పం టనష్టానికి సంబంధించిన నివేదిక కూడా సిద్ధం చేసి ఈ వారమే పంపగా, వాటికి సంబంధించిన నిధులు మంజూరు కావల్సి ఉన్నదని మంత్రి తె లియజేశారు.