తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు
తెలంగాణలో ప్రస్తుతం 29 వేల 636 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు లక్షా 41 వేల 930 మంది డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో ఒక్క జీహెచ్ఎంసీ..
తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 13 వందల 2 కేసులు... 9 మరణాలు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి తెలంగాణలో కోవిడ్ బాధితుల సంఖ్య లక్షా 72 వేల 608కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో వెయ్యి 42 మంది మృతి చెందారు. తెలంగాణలో ప్రస్తుతం 29 వేల 636 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు లక్షా 41 వేల 930 మంది డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 266 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్లో 102, రంగారెడ్డిలో 98 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.