Ganesh Nimajjanam : 35 లక్షల సీసీటీవీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నాము : డీజీపీ మహేందర్ రెడ్డి
Ganesh Nimajjanam : తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనాల ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి;
Ganesh Nimajjanam : తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనాల ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. అన్ని ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా పెట్టినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నామని.. కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసులు... ప్రజలతో మమేకమై... వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా ముగిసేలా చూస్తున్నామన్నారు.