ములుగు జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. పుట్టినరోజు వేడుకలు జరుపుకొని గోదావరి నదిలో ఈతకు వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. గాలింపు చేపట్టిన అధికారులు ముగ్గురి మృతదేహాలు వెలికితీశారు. మరో మృతదేహం కోసం గాలిస్తున్నారు. మృతులు కార్తీక్, ప్రకాశ్, శ్రీకాంత్గా గుర్తించారు. మరొకరు అన్వేష్ కోసం గాలిస్తున్నారు. బాధితులు రంగరాజుపురం వాసులుగా గుర్తించారు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.