జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం కోసం టీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది. ఇందులో సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తోపాటు మంత్రులు హరీశ్ రావు, హోం మంత్రి మహమూద్ అలీ, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, సబితా ఇంద్రా రెడ్డి, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్ను స్టార్ క్యాంపెయినర్లుగా టీఆర్ఎస్ ప్రకటించింది.