తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నిక లు నిర్వహించాలనే అంశంపై దాఖలైన పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో వాదనలు జరిగాయి. దీనిపై విచారణ చేపట్టింది హైకోర్టు పిటిషనర్లు, ప్రభుత్వం, స్టేట్ ఎలక్షన్ కమీషన్ వాదనలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఎన్ని రోజుల్లో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం వాదనలు వినిపిస్తూ 30 రోజుల టైం కావాలని అడిగింది. గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం ఎందుకు ఎన్నికలు నిర్వహించలే దని హైకోర్టు ప్రశ్నించింది. కులగణన పూర్తి కానందున నిర్వహించలేక పోయామని ప్రభుత్వం తెలిపింది. ఎన్నికలు నిర్వహించడానికి మరో 60 రోజులు సమయం కావాలని ఎలక్షన్ కమిషన్ అడిగింది. ఎన్నికలైనా పెట్టాలని లేదా పాత సర్పంచ్లనే కొనసాగించాలని పిటీషనర్లు వాదనలు వినిపించారు. ఆరు నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలని నిబంధన ఉందని.. కానీ ప్రభుత్వం ఈ ఎన్నికలు నిర్వహించలేదని పిటిషనర్లు వాదనలు వినిపించారు. ఇదిలా ఉండగా గతేడాది ఫిబ్రవరి 1న రాష్ట్రంలో సర్పంచ్ ల పదవీకాలం ముగిసింది. మూడు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.