HYDRA: సున్నం చెరువులో ఆక్రమణల కూల్చివేత

ఎల్లారెడ్డిగూడలో పార్క్ ఆక్రమణలు తొలగింపు.... హైడ్రాతో ఫలించిన 60 ఏళ్ల పోరాటం;

Update: 2025-06-30 04:15 GMT

తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా మాదాపూర్‌లోని సున్నం చెరువు పరిధిలో ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. పోలీసుల బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాల తొలగింపు జరుగుతోంది. మాదాపూర్ సున్నం చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో అక్రమంగా నిర్మించిన ఇళ్లను, నివాసాలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. చెవుల పునరుద్ధరణలో భాగంగా 10 కోట్ల రూపాయలతో సున్నం చెరువును హైడ్రా అభివృద్ధి చేస్తోంది. ఇక, 32 ఎకరాల విస్తీర్ణంలోని సున్నం చెరువులో భారీగా ఆక్రమణలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. అలాగే, చెరువు సమీపంలో అక్రమంగా వేసిన బోరు మోటార్లను సైతం హైడ్రా తొలగిస్తోంది. సున్నం చెరువు సమీపంలో ఏళ్ల తరబడి జోరుగా అక్రమ నీటి వ్యాపారం జరగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల సున్నం చెరువు పరిధిలోని భూగర్భ జలాలను వినియోగించవద్దని హైడ్రా హెచ్చరించింది.

హైడ్రాతో 60 ఏళ్ల సమస్యకు పరిష్కారం

ప్ర­భు­త్వ భూ­ముల పరి­ర­క్ష­ణే లక్ష్యం­గా తె­లం­గాణ సర్కా­ర్ ఏర్పా­టు చే­సిన హై­డ్రా.. తమకు అప్ప­గిం­చిన పను­ల­ను సమ­ర్థం­గా ని­ర్వ­ర్తి­స్తోం­ది. మధు­రా­న­గ­ర్​ మె­ట్రో రై­ల్వే స్టే­ష­న్​ సమీ­పం­లో­ని ఎల్లా­రె­డ్డి­గూ­డ­లో పా­ర్క్​ ఆక్ర­మ­ణ­ల­ను హై­డ్రా సి­బ్బం­ది తొ­ల­గిం­చా­రు. 1961 నుం­చి ఉన్న ఆక్ర­మ­ణ­ల­ను తొ­ల­గిం­చ­డం­తో 1533 గజాల వి­స్తీ­ర్ణం­లో­ని పా­ర్క్​ అం­దు­బా­టు­లో­కి వచ్చిం­ది. సాయి సా­ర­ధి­న­గ­ర్ రె­సి­డెం­ట్స్​ వె­ల్ఫే­ర్​ అసో­సి­యే­ష­న్​ ప్ర­తి­ని­ధు­లు ప్ర­జా­వా­ణి­లో ఫి­ర్యా­దు చే­య­డం­తో హై­డ్రా కమి­ష­న­ర్​ రం­గ­నా­థ్​ స్పం­దిం­చి వి­చా­ర­ణ­కు ఆదే­శిం­చా­రు. 1961లో 5 ఎక­రాల వి­స్తీ­ర్ణం­లో సాయి సా­ర­ధి­న­గ­ర్​ పే­రిట 35 ప్లా­ట్ల­తో లే­అ­వు­ట్​ ఏర్పా­టు చే­శా­రు. 1,533 గజాల స్థ­లా­న్ని పా­ర్క్​­గా చూ­పిం­చా­రు. లే­అ­వు­ట్​ వే­సిన నా­రా­యణ ప్ర­సా­ద్​ వా­ర­సు­లు పా­ర్కు స్థ­లం­లో షె­డ్డు వేసి ఆక్ర­మిం­చా­రు. అధి­కా­రు­ల­ను మే­నే­జ్​ చేసి ఇంటి నం­బ­ర్​ కూడా తె­చ్చు­కు­న్నా­రు. ఈ లే­అ­వు­ట్​­లో 6 రో­డ్ల­ను అభి­వృ­ద్ధి చేసి పా­ర్క్​­ను మా­త్రం ఖాళీ చే­యిం­చ­లే­ద­ని జీ­హె­చ్​ఎం­సీ పలు­మా­ర్లు కా­ల­నీ వా­సు­లు ఫి­ర్యా­దు చే­శా­రు. స్థా­ని­కు­లు పలు­మా­ర్లు GHMC­కి ఫి­ర్యా­దు చే­సి­న­ప్ప­టి­కీ, 60 ఏళ్లు­గా ఈ ఆక్ర­మ­ణ­ను తొ­ల­గిం­చ­లే­క­పో­యా­రు. దీం­తో.. సాయి సా­ర­ధి­న­గ­ర్ రె­సి­డెం­ట్స్ వె­ల్ఫే­ర్ అసో­సి­యే­ష­న్ ప్ర­తి­ని­ధు­లు ప్ర­జా­వా­ణి­లో హై­డ్రా( Hydra)కు ఫి­ర్యా­దు చే­శా­రు. హై­డ్రా కమి­ష­న­ర్ ఏ.వీ. రం­గ­నా­థ్ ఆదే­శాల మే­ర­కు.. హై­డ్రా అధి­కా­రు­లు క్షే­త్ర­స్థా­యి­లో వి­చా­రణ చే­ప­ట్టా­రు. వి­విధ ప్ర­భు­త్వ శాఖల సహ­కా­రం­తో సమ­గ్ర దర్యా­ప్తు ని­ర్వ­హిం­చి, పా­ర్కు స్థ­లం ఆక్ర­మ­ణ­కు గు­రై­న­ట్లు ని­ర్ధా­రిం­చా­రు.

Tags:    

Similar News