TGSRTC : ఆర్టీసీ ప్యాసింజర్లపై పెరిగిన టోల్ చార్జీల భారం

Update: 2024-06-13 08:42 GMT

టోల్ గేట్ ఛార్జీలకు అనుగుణంగా రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు చార్జీలు మరోసారి పెరిగాయి. హైవేలపై టోల్ చార్జీలను పెంచుతూ కేంద్రం ఇటీవల తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా టోల్ సెస్ను సవరించింది. టోల్ గేట్ చార్జీలు పెరగడంతో ఆర్టీసీ ప్రయాణికులపై ఆ భారం మోపిందని చెబుతున్నారు. టికెట్ చార్జీల్లో చేర్చిన టోల్ ఫీజును తాజాగా టికెట్ పై రూ.3 పెంచింది.

ఎక్స్ ప్రెస్ బస్సుల్లో రూ.10 నుంచి రూ.13, డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ, వజ్ర బస్సుల్లో రూ.13 నుంచి రూ. 16, గరుడ ప్లస్ బస్సుల్లో రూ.14 నుంచి రూ.17, గరుడ ప్లస్ బస్సుల్లో రూ. 14 నుంచి రూ.17. నాన్-ఏసీ స్లీపర్, హైబ్రిడ్ స్లీపర్ బస్సులలో 15 నుంచి రూ.18కి, ఏసీ స్లీపర్ బస్సుల్లో రూ.20 నుంచి రూ.23కి పెరిగిన చార్జీలు ఇటీవల అమల్లోకి వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది. వారిపై ఎలాంటి భారం పడే అవకాశం లేదు.

ఇప్పుడు ఆ భారాన్ని పురుషులు మాత్రమే భరించాల్సి ఉంటుంది. ఒక్కో టోల్ గేట్ కు రూ. 3 పెంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నిత్యం 30 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని.. ఇందులో నగరంలో 12 లక్షల మంది, పల్లె వెలుగు బస్సుల్లో 12 లక్షల మంది ప్రయా ణిస్తున్నారని అధికారులు చెప్పారు. ఛార్జీల పెంపు భారం 6 లక్షల మందికి మాత్రమే అదనపు భారం పడుతుందని అధికార వర్గాలు తెలిపాయి. టోల్ చార్జీలు జనం నుంచే వసూలు చేయడంతో ఆర్టీసీపై అదనపు భారం ఉండదని నిపుణులు అంటున్నారు.

Tags:    

Similar News