TS : నేటితో ముగియనున్న కేసీఆర్ ఎన్నికల ప్రచారం

Update: 2024-05-10 05:51 GMT

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర ఇవాళ్టితో ముగియనుంది. నేడు సిద్దిపేటలో జరిగే సభతో ఆయన ఎన్నికల ప్రచారానికి ముగింపు పలకనున్నారు. 16 రోజులపాటు 13 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగింది. నేడు సిరిసిల్లలో జరిగే రోడ్ షో, సిద్దిపేటలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. రేపు తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నట్లు సమాచారం.

ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు సిరిసిల్లలో రోడ్ షో నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు సిద్దిపేటలో బహిరంగ సభ జరగనుంది. సిద్దిపేట సభతో కేసీఆర్ బస్సుయాత్ర ముగియనుంది. ఏప్రిల్ 24న మిర్యాలగూడ నుంచి ప్రారంభమైన కేసీఆర్ ఎన్నికల ప్రచార బస్సుయాత్ర.. 16 రోజుల పాటు 13 లోక్ సభ నియోజకవర్గాల్లో కేసీఆర్ రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ లు నిర్వహించారు.

ఎన్నికల సంఘం నిషేధంతో కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి 48 గంటల పాటు బ్రేక్ పడింది. మే 1వ తేదీ రాత్రి 8 గంటల నుంచి మే 3వ తేదీ రాత్రి 8 గంటల వరకు నిషేధం విధించిన ఈసీ.. నిషేధం ముగియడంతో కేసీఆర్ బస్సు యాత్ర యథావిధిగా కొనసాగనుంది.

Tags:    

Similar News