KCR: ప్రత్యక్ష పోరాటానికి కేసీఆర్ సిద్ధం

బనకచర్ల అడ్డుకునేందుకు పోరాటం... కాంగ్రెస్ పై పోరాడాలని కేసీఆర్ దిశానిర్దేశం... క్షేత్రస్థాయి పోరాటాలకు గులాబీ దళపతి సిద్ధం;

Update: 2025-07-31 05:00 GMT

ఉద్దే­శ­పూ­ర్వ­కం­గా­నే కా­ళే­శ్వ­రం ప్రా­జె­క్టు­ను తె­లం­గాణ ప్ర­భు­త్వం రై­తుల సం­క్షే­మం, సా­గు­నీ­టి కోసం వి­ని­యో­గిం­చ­డం లే­ద­ని బీ­ఆ­ర్ఎ­స్ అధి­నేత కే­సీ­ఆ­ర్ అన్నా­రు. ఆం­ధ్ర­ప్ర­దే­శ్ ప్ర­భు­త్వం ని­ర్మిం­చ­ను­న్న బన­క­చ­ర్ల ప్రా­జె­క్ట్ ను ఎట్టి­ప­రి­స్థి­తు­ల్లో అడ్డు­కు­ని తీ­ర­తా­మ­ని తే­ల్చి చె­ప్పా­రు. రై­తుల సం­క్షే­మం కోసం, వ్య­వ­సాయ సం­క్షో­భా­న్ని ని­వా­రిం­చ­డం­తో పాటు కాం­గ్రె­స్ ప్ర­భు­త్వ వై­ఫ­ల్యా­ల­ను ఎం­డ­గ­ట్టా­ల­ని బీ­ఆ­ర్ఎ­స్ నే­త­ల­కు దిశా ని­ర్దే­శం చే­శా­రు. తె­లం­గాణ ప్ర­జల ప్ర­యో­జ­నా­ల­ను కా­పా­డేం­దు­కు క్షే­త్ర స్థా­యి­లో బీ­ఆ­ర్ఎ­స్ చే­ప­ట్టా­ల్సిన కా­ర్యా­చ­ర­ణ­పై కే­సీ­ఆ­ర్ సు­దీ­ర్ఘ సమా­వే­శం ని­ర్వ­హిం­చా­రు. తె­లం­గాణ రై­తుల ప్ర­యో­జ­నా­ల­ను ఫణం­గా పె­ట్టి ఏపీ ప్ర­యో­జ­నా­ల­ను కా­పా­డేం­దు­కు రే­వం­త్ రె­డ్డి ప్ర­భు­త్వ­మే పా­ల­నా వి­ధా­నా­ల­ను అమలు చే­య­డం దు­ర్మా­ర్గం అన్నా­రు. తమను నమ్మిన ఓటు వే­సిన పా­పా­ని­కి తె­లం­గాణ రై­తాం­గా­ని­కి కాం­గ్రె­స్ ప్ర­భు­త్వం శా­శ్వత అన్యా­యం చే­స్తుం­ద­ని కే­సీ­ఆ­ర్ మం­డి­ప­డ్డా­రు. రై­తుల సం­క్షే­మా­న్ని గా­లి­కొ­ది­లే­సిన కాం­గ్రె­స్ ప్ర­భు­త్వ దు­ర్మా­ర్గ­పు వై­ఖ­రి­ని తీ­వ్రం­గా ఎం­డ­గ­ట్టా­ల­ని బీ­ఆ­ర్ఎ­స్ నే­త­ల­కు సూ­చిం­చా­రు. చం­ద్ర­బా­బు, మో­దీల ప్ర­యో­జ­నా­లు కా­పా­డేం­దు­కు రే­వం­త్ రె­డ్డి తహతహ లా­డు­తు­న్నా­ర­ని, ప్ర­జ­లు ఈ వి­ష­యా­న్ని గమ­ని­స్తు­న్నా­ర­ని పే­ర్కొ­న్నా­రు. బీ­ఆ­ర్‌­ఎ­స్‌ వి­ద్యా­ర్థి వి­భా­గం తర­హా­లో ఇతర వి­భా­గా­ల­ను బలో­పే­తం చేసి రా­ష్ట్ర వ్యా­ప్తం­గా రైతు సమ­స్య­లు, ఇతర అం­శా­ల­పై బీ­ఆ­ర్ఎ­స్ క్షే­త్ర­స్థా­యి­లో పో­రా­టం చే­యా­ల­ని పి­లు­పు­ని­చ్చా­రు. రై­తుల పక్షాన ని­లి­చి, వారి తర­ఫున బీ­ఆ­ర్ఎ­స్ పో­రా­టం మరింత ఉధృ­తం చే­యా­లి. కాం­గ్రె­స్, బీ­జే­పీ దొం­దు దొం­దే­న­ని.. పర­స్ప­రం వి­మ­ర్శ­లు చే­సు­కుం­టూ కా­ల­యా­పన చే­స్తు­న్నా­య­ని వి­మ­ర్శిం­చా­రు.

బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం

బీసీ రి­జ­ర్వే­ష­న్ల కోసం బీ­ఆ­ర్ఎ­స్ కా­ర్యా­చ­రణ రూ­పొం­దిం­చిం­ది. కాం­గ్రె­స్‌­కు పో­టీ­గా ఢి­ల్లీ వె­ళ్లి రా­ష్ట్ర­ప­తి­ని కల­వా­ల­ని బీ­ఆ­ర్ఎ­స్ హై కమాం­డ్ ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. బీసీ రి­జ­ర్వే­ష­న్ల కోసం ఆగసు 8వ తే­దీన కరీం­న­గ­ర్‌­లో బీ­ఆ­ర్ఎ­స్ భారీ బహి­రంగ సభ ని­ర్వ­హిం­చ­డా­ని­కి ప్లా­న్ చే­సిం­ది. ఈ క్ర­మం­లో తె­లం­గాణ భవ­న్‌­లో మా­జీ­మం­త్రి తల­సా­ని శ్రీ­ని­వా­స్ యా­ద­వ్ మీ­డి­యా­తో మా­ట్లా­డా­రు. బీసీ బి­ల్లు­పై కాం­గ్రె­స్, బీ­జే­పీ­లు కలి­సి డ్రా­మా­లా­డు­తు­న్నా­య­ని ఆరో­పిం­చా­రు. ఈ నె­పా­న్ని కేం­ద్ర ప్ర­భు­త్వం­పై నె­ట్టి కాం­గ్రె­స్‌ తప్పు­కుం­టోం­ద­ని మం­డి­ప­డ్డా­రు. బీ­సీల పట్ల చి­త్త­శు­ద్ది ఉంటే.‌. మి­గి­లిన మూడు మం­త్రి పద­వు­ల­ను బీ­సీ­ల­కు ఇవ్వా­ల­ని డి­మాం­డ్ చే­శా­రు. ము­ఖ్య­మం­త్రి రే­వం­త్‌­రె­డ్డి ఢి­ల్లీ­లో డ్రా­మా­లు ఆపా­ల­ని తల­సా­ని శ్రీ­ని­వా­స్ యా­ద­వ్ హి­త­వు పలి­కా­రు.

Tags:    

Similar News