TGSPDCL: విద్యుత్ ఛార్జీల పెంపుపై కీలక ప్రకటన

Update: 2025-03-21 09:15 GMT

విద్యుత్ ఛార్జీల పెంపుపై TGSPDCL సీఎండీ ముషారఫ్ ఫరూకీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ఛార్జీల పెంపునకు ఎలాంటి ప్రతిపాదనలు చేయడం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ విద్యుత్ నియంత్రణ కమిషన్ ముందు టారిఫ్ ప్రతిపాదనలను ఉంచిన తర్వాత ఈ విషయాన్ని తెలిపారు.ఇవాళ విద్యుత్‌ నియంత్రణ భవన్‌లో ఈఆర్సీ చైర్మన్‌ డాక్టర్‌ జస్టిస్‌ డి. నాగార్జున అధ్యక్షతన బహిరంగ విచారణ జరిగింది. ఈ సంవత్సరంలో విద్యుత్ చార్జీల పెంపునకు ఎటువంటి ప్రతిపాదనలు చేయలేదని తెలిపారు. టీజీపీఎస్సీ డీసీఎల్ ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ప్రతిపాదనలపై ఈ విచారణ జరగ్గా.. సీఎండీ, జేఎండీ శ్రీనివాస్ హాజరయ్యారు. విద్యుత్ సంస్థల నిర్ణయంతో ఈ ఏడాది విద్యుత్ ఛార్జీల్లో పెరుగుదల లేకపోవడం సామాన్య ప్రజలపై భారం తగ్గించనుంది.

Tags:    

Similar News