Komatireddy Raj Gopal Reddy: పార్టీ మారే స్వేచ్ఛ అందరికీ ఉంది- రాజగోపాల్రెడ్డి
Komatireddy Raj Gopal Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నా విషయంలో ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు రాజగోపాల్ రెడ్డి.;
Komatireddy Raj Gopal Reddy: 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వెళ్లినప్పుడు మాట్లాడని నేతలు ఇప్పుడు నా విషయంలో ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పార్టీ మారే స్వేచ్చ అందరికీ ఉందని, నైతికంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాకే పార్టీ మారుతాననని అన్నారు. సీఎం కేసీఆర్ ఏ రోజూ అపాయింట్మెంట్ ఇవ్వలేదని ప్రజా సమస్యలపై కలుద్దామంటే మంత్రులు కూడా అపాయింట్మెంట్లు ఇవ్వలేదని విమర్శించారు. వ్యాపారాలే ముఖ్యమనుకుంటే టీఆర్ఎస్లోకే వెళ్లేవాడని అన్నారు.