రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత కలకలం..!

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత సంచారం స్థానికుల్ని భయాందోళనలకు గురి చేస్తోంది. కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్‌ అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తోంది.

Update: 2021-02-17 16:15 GMT

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత సంచారం స్థానికుల్ని భయాందోళనలకు గురి చేస్తోంది. కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్‌ అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తోంది. గత కొన్ని రోజులుగా పశువులు, దూడలపై చిరుత దాడులు చేయడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. రిజర్వాయర్‌కు చెందిన డ్రైవర్‌కు చిరత కనిపించడంతో.. సెల్‌ఫోన్‌లో ఫోటో తీసినట్టు తెలుస్తోంది. అటవీ ప్రాంతం వైపు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News