LOCAL WAR: వణికించే చలిలోనూ ఓటెత్తిన పల్లెలు

85.86 శాతం పల్లె ప్రజల ఓటు... తొలి విడత కన్నా 1.58 శాతం ఎక్కువ.. యాదాద్రి భువనగిరిలో అత్యధికం

Update: 2025-12-15 03:30 GMT

రెం­డో విడత గ్రామ పం­చా­య­తీ సర్పం­చి, వా­ర్డు సభ్యుల ఎన్ని­క­ల్లో­నూ కాం­గ్రె­స్‌ మద్ద­తు­దా­రు­లు వి­జ­య­దుం­దు­భి మో­గిం­చా­రు. వణి­కిం­చే చలి­లో­నూ ఓట­ర్ల­లో ఉత్సా­హం వె­ల్లు­వె­త్తిం­ది. ఉదయం నుం­చే బా­రు­లు తీ­రా­రు. 85.86 శాతం పల్లె ప్ర­జ­లు ఓటు వే­శా­రు. ఈ నెల 11న జరి­గిన మొ­ద­టి వి­డ­త­లో నమో­దైన(84.28%) పో­లిం­గ్‌ కన్నా ఇది 1.58 శాతం ఎక్కువ. ఆది­వా­రం సె­ల­వు­రో­జు కా­వ­డం­తో పో­లిం­గ్‌ శాతం పె­రి­గిం­ది. రెం­డో దశలో 4,333 గ్రామ పం­చా­య­తీ సర్పం­చి, 38,350 వా­ర్డు సభ్యుల ఎన్ని­క­ల­కు నో­టి­ఫి­కే­ష­న్‌ వె­లు­వ­డిం­ది. వీ­టి­లో 415 గ్రామ సర్పం­చి, 8,307 వా­ర్డు పద­వు­లు ఏక­గ్రీ­వ­మ­య్యా­యి. మం­చి­ర్యాల, వరం­గ­ల్‌ జి­ల్లా­ల్లో­ని ఒక్కొ­క్క గ్రా­మం­లో, నల్గొండ జి­ల్లా­లో­ని మూడు గ్రా­మా­ల్లో, 108 వా­ర్డు­ల్లో నా­మి­నే­ష­న్లు దా­ఖ­లు కా­లే­దు. ఇంకో రెం­డు గ్రా­మా­ల్లో, 18 వా­ర్డు­ల్లో ఎన్ని­క­ల­ను ని­లి­పి­వే­శా­రు. ఆది­వా­రం 193 మం­డ­లా­ల్లో­ని 3,911 గ్రా­మ­పం­చా­య­తీ సర్పం­చు­లు, 29,917 వా­ర్డు సభ్యుల పద­వు­ల­కు ఎన్ని­క­లు జరి­గా­యి. 12,782 మంది సర్పం­చి పద­వు­ల­కు, 71,071 మంది వా­ర్డు సభ్యు­ల­కు పో­టీ­ప­డ్డా­రు. మొ­ద­టి విడత మా­ది­రి­గా­నే రెం­డో వి­డ­త­లో­నూ యా­దా­ద్రి భు­వ­న­గి­రి జి­ల్లా­లో అత్య­ధి­కం­గా 91.72 శాతం పో­లిం­గ్‌ నమో­దైం­ది.

ని­జా­మా­బా­ద్‌­లో అత్య­ల్పం­గా  76.71% మంది ఓట్లే­శా­రు. 29 జి­ల్లా­ల్లో 80 శా­తా­ని­కి పైగా పో­లిం­గ్‌ జరి­గిం­ది. మొ­త్తం ఓట­ర్లు 54,40,339కు గాను 46,70,972 మంది ఓటు వే­య­గా వా­రి­లో మహి­ళ­లే అధి­కం­గా ఉన్నా­రు. మొ­త్తం 27,82,494 మంది మహి­ళా ఓట­ర్ల­లో 23,93,010.. పు­రుష ఓట­ర్లు 26,57,702లో 22,77,902 మంది.. ఇత­రు­ల్లో 143కు 60 మంది ఓట్లు వే­శా­రు. అక్క­డ­క్క­డా చె­దు­రు­మ­దు­రు ఘట­న­లు మి­న­హా రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా ఓటిం­గ్‌ ప్ర­శాం­తం­గా సా­గిం­ది. ఎం­పీ­లు, ఎమ్మె­ల్యే­లు, ఎమ్మె­ల్సీ­లు, ప్ర­జా­ప్ర­తి­ని­ధు­లు ఓటు హక్కు­ను వి­ని­యో­గిం­చు­కు­న్నా­రు. వె­బ్‌­కా­స్టిం­గ్‌ ద్వా­రా ఎన్ని­కల తీ­రు­ను అధి­కా­రు­లు పర్య­వే­క్షిం­చా­రు. 1 గం­ట­కు  పో­లిం­గు ము­గి­య­గా... మధ్యా­హ్నం 2 గంటల నుం­చి ఓట్ల లె­క్కిం­పు మొ­ద­లైం­ది. పోటీ హో­రా­హో­రీ­గా జర­గ­డం­తో చాలా చో­ట్ల ఉత్కం­ఠ­భ­రి­తం­గా లె­క్కిం­పు జరి­గిం­ది. పలు చో­ట్ల ఒకటి, రెం­డు.. ఇలా తక్కువ మె­జా­ర్టీ­తో­నూ చాలా మంది వి­జ­యం సా­ధిం­చా­రు. ఆది­వా­రం రా­త్రి రెం­డో విడత ఎన్ని­క­ల్లో సర్పం­చు­లు, వా­ర్డు సభ్యుల ఫలి­తాల వె­ల్ల­డి అనం­త­రం ఉప సర్పం­చి ఎన్ని­క­ల­ను అధి­కా­రు­లు ని­ర్వ­హిం­చా­రు. వా­ర్డు సభ్యు­ల­ను సమా­వే­శ­ప­రి­చి ఉప­స­ర్పం­చు­ల­ను ఎన్ను­కు­న్నా­రు. 

దక్షిణ భారతంపైకి చలిగాలులు

వా­య­వ్య, మధ్య భా­ర­తం­లో అధి­క­పీ­డ­నం కొ­న­సా­గు­తోం­ది. దీని ప్ర­భా­వం­తో సై­బీ­రి­యా నుం­చి వచ్చే శీతల గా­లు­లు మధ్య భా­ర­తం, దా­ని­కి ఆను­కు­ని ఉన్న దక్షిణ భా­ర­తం­పై­కి వీ­స్తు­న్నా­యి. చా­లా­కా­లం తర్వాత చలి­గా­లు­లు తె­లం­గాణ, కో­స్తా, రా­య­ల­సీమ, ఉత్తర కర్ణా­టక మీ­దు­గా తమి­ళ­నా­డు­లో­ని పలు ప్రాం­తా­ల­కు వి­స్త­రిం­చా­యి. వీటి ప్ర­భా­వం­తో రా­ష్ట్రం­లో చలి తీ­వ్రత కొ­న­సా­గు­తోం­ది. అనేక ప్రాం­తా­ల్లో మంచు దట్టం­గా కు­రు­స్తోం­ది. పది రో­జుల నుం­చి చలి గా­లుల జోరు తగ్గ­లే­దు. ఉత్త­ర­కో­స్తా­లో ఏజె­న్సీ ప్రాం­తా­ల­తో­పా­టు రా­య­ల­సీ­మ­లో అనేక ప్రాం­తా­ల్లో రా­త్రి ఉష్ణో­గ్ర­త­లు సా­ధా­ర­ణం కంటే మూడు నుం­చి ఐదు డి­గ్రీ­లు తక్కు­వ­గా నమో­ద­య్యా­యి. ఆది­వా­రం అర­కు­లో­య­లో 4.4 డి­గ్రీల కని­ష్ఠ ఉష్ణో­గ్రత నమో­దైం­ది. మై­దాన ప్రాం­తం­లో­ని శ్రీ­స­త్య­సా­యి జి­ల్లా ఆర్‌.అనం­త­పు­రం­లో 8.2 డి­గ్రీల ఉష్ణో­గ్రత నమో­దైం­ది. ప్ర­జ­లు అప్ర­మ­త్తం­గా ఉం­డా­ల­ని సూ­చిం­చా­రు.

Tags:    

Similar News