TGSRTC : ఆర్టీసీ చార్జీలు పెంచలేదన్న సజ్జనార్

Update: 2024-06-13 08:48 GMT

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని టీజీఎస్ ఆర్టీసీ ( TGSRTC ) స్పష్టం చేసింది. సాధారణ చార్జీలు యథాతథంగానే ఉన్నాయని పేర్కొంది. హైవేలపై టోల్ చార్జీలను ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెంచుతూ నిర్ణయం తీసుకుందని... ఆ పెంచిన టోల్ చార్జీల మేరకు టికెట్ లోని టోల్ సెస్ ను సవరించామని వివరించింది.

ఈ సవరించిన టోల్ సెస్ ఈ నెల 3వ తేదీ నుంచే అమల్లోకి వచ్చిందని టీజీఎస్ఆర్టీసీ తెలిపింది. సాధారణ రూట్లలో టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేసింది. వాస్తవాలు తెలుసుకోకుండా టీజీఎస్ఆర్టీసీ సాధారణ బస్ చార్జీలను పెంచిందంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం మంచిది కాదని సూచించింది.

సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు ప్రచారం చేసే వారిపై పోలీసు శాఖ సహకారంతో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Tags:    

Similar News