Telangana : రానున్న మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు

Update: 2025-06-28 10:15 GMT

వాయువ్య బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడినట్లు ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతా వరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పిన వాతావ రణ శాఖ గంటకు 50 నుంచి 60 కిలోమీ టర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్ మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగి త్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూ పాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

Tags:    

Similar News