హైదరాబాద్కు టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా చేసిందేమి లేదని విమర్శించారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. దేశం మొత్తం మీద తామే పెన్షన్లు ఇస్తున్నామన్నట్టు టీఆర్ఎస్ డబ్బా కొట్టుకుంటుందని విమర్శించారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ కమెడియన్లలా వ్యవహరిస్తున్నారని అరవింద్ ఎద్దేవా చేశారు. ప్రస్తుత మేనిఫెస్టోలో రజకులకు, నాయీ బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలు గతంలో ఇవ్వలేదా అని టీఆర్ఎస్ను ప్రశ్నించారు.