ప్రభుత్వ భూముల వేలంలో వెయ్యి కోట్ల గోల్మాల్ : రేవంత్రెడ్డి
ప్రభుత్వ భూముల వేలంలో వెయ్యి కోట్ల గోల్మాల్ జరిగిందని ఆరోపించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.;
ప్రభుత్వ భూముల వేలంలో వెయ్యి కోట్ల గోల్మాల్ జరిగిందని ఆరోపించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సీఎం కేసీఆర్ కుటుంబంతో ఆర్థిక లావాదేవీలు ఉన్న కంపెనీలకు స్థలాలను కట్టబెట్టారని ఆరోపించారు. ఐదుగురు వ్యక్తులు కలిసి రాష్ట్ర ఖజానాకు వెయ్యి కోట్ల నష్టం చేకూర్చారంటూ మండిపడ్డారు. భూముల వేలంలో సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కూడా పాల్గొన్నారని.. ఆయన సంస్థలు దాదాపు తొమ్మిదిన్నర ఏకరాల కొనుగోలు చేశాయని ఆరోపించారు రేవంత్. ఎకరం 60 కోట్ల కంటే తక్కువకు అమ్ముడుబోయిన భూముల వేలాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.