ఛార్జ్షీట్ పేరుతో బీజేపీ నాటకానికి తెర లేపిందని మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్రెడ్డి ఆరోపించారు. కేంద్ర మంత్రి జవదేకర్పై ఛార్జ్షీట్ విడుదల చేస్తున్నట్లు తెలిపారు. శ్రీశైలం, కల్వకుర్తి ప్రాజెక్టుల అక్రమాలపై కేంద్ర పర్యావరణశాఖ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. తెలంగాణను కాలుష్యం చేస్తున్నారని కేంద్రానికి ఎన్నో లేఖలు రాశామన్నారు. ముందస్తుగా ఫిర్యాదు చేస్తే స్పందించలేదని మండిపడ్డారు. టీఆర్ఎస్ సూత్రదారి, బీజేపీ పాత్రదారి అంటూ విమర్శలు గుప్పించారు. ప్రకాశ్ జలదేకర్కు చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్, కేటీఆర్లపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు.