Revanth Invites KCR : ప్రజాపాలన విజయోత్సవాలకు కేసీఆర్కు రేవంత్ ఆహ్వానం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఆహ్వానించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. రేపటి నుంచి మూడు రోజుల పాటు విజయోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు కేసీఆర్ను పిలవాలని భావిస్తోంది తెలంగాణ సర్కార్. ఈ నెల 9న సెక్రటేరియట్లో తెలుగు తల్లి విగ్రహావిష్కరణ జరగనుంది. ఇందులో పాల్గొనాల్సిందిగా కేసీఆర్కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆహ్వానం పంపనుంది. మంత్రి పొన్నం స్వయంగా వెళ్లి కేసీఆర్ను ఆహ్వానించనున్నారు. ఐతే.. కేసీఆర్ దీనిపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.