కేసీఆర్ చేతిలో బందీ అయిన తెలంగాణకు విముక్తి కలిగిస్తాం : రేవంత్ రెడ్డి
కేసీఆర్ చేతిలో బందీ అయిన తెలంగాణకు విముక్తి కలిగిస్తామన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.;
కేసీఆర్ చేతిలో బందీ అయిన తెలంగాణకు విముక్తి కలిగిస్తామన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కాకతీయ రాజుల మీద సమ్మక, సారలమ్మలు ఏవిధంగా పోరాటం చేశారో... అలాగే ములుగు ఎమ్మెల్యే సీతక్కతో కలిసి పోరాటం చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. పేద ప్రజల సమస్యలపై పోరాడుతూనే ఉంటామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు ప్రతి పేదవాడికి ఇచ్చిన ఘనత కాంగ్రెస్దేనన్నారు. తెలంగాణ రాష్ట్రం దొంగల పాలైందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి.