తెలంగాణలో RHK సర్కార్ నడుస్తోందని సెటైర్లు వేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్.. అందుకే కేటీఆర్ బావమరిది ఇష్యూను నీరుగార్చారని ఆరోపించారు. కేటీఆర్ నోటీసులకు బదులిచ్చానని... తాను కూడా నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిపారు. బూతులు తిట్టేటోళ్లు నోటీసులు ఇస్తే విలువేముందన్నారు. బీఆర్ఎస్ను నామరూపాల్లేకుండా భూస్థాపితం చేస్తానన్నారు బండి సంజయ్... ఆరు గ్యారెంటీలు అమలు చేసేవరకు కాంగ్రెస్ను వదిలేది లేన్నారు.