హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో 12 ఏళ్ల కింద జరిగిన సంచలన బాంబు పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన ఉరిశిక్షను ఖరారు చేస్తూ తుది తీర్పు చెప్పింది. ఈ కేసులో ఇప్పటికే 2016లోనే ఎన్ఐఏ కోర్టు దోషులకు ఉరిశిక్ష విధించింది. ఈ తీర్పును ఇవాళ హైకోర్టు సమర్ధించింది. 2013 ఫిబ్రవరి 21వ తేదీన దిల్సుఖ్నగర్ జంట బాంబ్ పేలుళ్లు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఐదుగురు దోషులు దాఖలు చేసిన అప్పీళ్లను ఉన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది.