తమిళనాడులోని అరుణాచలేశ్వరుడి గిరి ప్రదక్షిణకు(తిరువన్నామలై) వెళ్లే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. స్పెషల్ బస్సులతో ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు టీజీఆర్టీసీ ఎండీ సజ్జనార్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.ఈ నెల 21న గురు పౌర్ణమి సందర్భంగా అరుణాచలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. 19 నుంచి 22వ తేదీల వరకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. హైదరాబాద్తో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్ తదితర పట్టణాల నుంచి అందుబాటులో ఉండనున్నాయి. అరుణాచల గిరి ప్రదక్షిణ ప్యాకేజీ బుకింగ్ కోసం ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ http://tsrtconline.inను సందర్శించాలని సజ్జనార్ సూచించారు. ఈ ప్యాకేజీలో కాణిపాక వరసిద్ది వినాయక స్వామితో పాటు శ్రీపురంలోని గోల్డెన్ టెంపుల్ను సందర్శించే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.