Heart Attack : గుండెపోటుతో ఆలయ అర్చకుడు మృతి

Update: 2024-04-24 07:05 GMT

హైదరాబాద్ లోని జియాగూడ రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు శృంగారం రాజగోపాలాచార్యులు (55) సోమవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆలయ నిర్వాహకులు చారి, శేషాచార్యులు తెలిపారు. ఆచారికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ హిందూ దేవాలయాల పురోభివృద్ధికి పాటుపడి ఎంతో ఖ్యాతిగడించారు .

కాగా జియాగూడలోని రంగనాథస్వామి దేవస్థానానికి 400 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. మూసీనది ఒడ్డున దీనిని నంగూర్‌ ప్రతమ పీఠం నాలుగు వందల యేళ్ల క్రితం నిర్మించింది. ఇక్కడ జరిగే వైకుంఠ ఏకాదశి పండుగకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది భక్తులు తరలివస్తుంటారు. ఇంతటి ప్రతిష్ట కలిగిన రంగనాథస్వామి దేవస్థానానికి శృంగారం రాజగోపాలాచార్యులు గత కొంతకాలంగా ప్రథాన అర్చకులుగా సేవలు అందిస్తున్నారు

 

Tags:    

Similar News