TG: బంద్‌ విరమించిన ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు

కీలక ప్రకటన చేసిన తెలంగాణ ప్రైవేట్ విద్యా సంస్థలు

Update: 2025-11-07 15:29 GMT

తె­లం­గా­ణ­లో ప్రై­వే­టు కా­లే­జీల యా­జ­మా­న్యా­ల­తో ప్ర­భు­త్వం జరి­పిన చర్చ­లు సఫ­ల­మ­య్యా­యి. ఫీజు రీ­యిం­బ­ర్స్‌­మెం­ట్‌ బకా­యి­ల­పై ఉప­ము­ఖ్య­మం­త్రి భట్టి వి­క్ర­మా­ర్క­తో చర్చల అనం­త­రం బం­ద్‌ వి­ర­మి­స్తు­న్న­ట్టు ఉన్నత వి­ద్యా­సం­స్థల సమా­ఖ్య ప్ర­క­టిం­చిం­ది. ప్రై­వే­టు కా­లే­జీ­ల­కు ఫీజు బకా­యి­లు చె­ల్లిం­పు­న­కు ప్ర­భు­త్వం అం­గీ­కా­రం తె­లి­పిం­ది. తక్ష­ణ­మే రూ.600 కో­ట్లు వి­డు­ద­ల­కు డి­ప్యూ­టీ సీఎం హామీ ఇచ్చా­రు. మరో రూ.300 కో­ట్లు త్వ­ర­లో చె­ల్లిం­చేం­దు­కు హామీ ఇచ్చా­రు. నేటి నుం­చి తె­లం­గా­ణ­లో యథా­వి­ధి­గా వి­ద్యా­సం­స్థ­లు తె­రు­చు­కో­ను­న్నా­యి. ఇది­లా ఉంటే.. ఉమ్మ­డి రా­ష్ట్రం­లో వై­ఎ­స్సా­ర్ హయాం­లో రీ­యిం­బ­ర్స్‌­మెం­ట్ స్కీ­మ్ ప్రా­రం­భ­మైం­ది. ఆ తరు­వాత సీ­ఎం­గా పని­చే­సిన రో­శ­య్య, కి­ర­ణ్ కు­మా­ర్ రె­డ్డి ఇద్ద­రూ ఈ స్కీ­మ్‌­ను కొ­న­సా­గిం­చా­రు. గతం­లో­నూ రా­ష్ట్ర ప్ర­భు­త్వం రూ.600 కో­ట్లు ఫీజు బకా­యి­లు చె­ల్లిం­చిం­ది. రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా ఇం­జి­నీ­రిం­గ్, ఫా­ర్మ­సీ తది­తర వృ­త్తి వి­ద్యా కళా­శా­ల­ల­తో పాటు డి­గ్రీ, పీజీ కళా­శా­ల­ల­ను 3 నుం­చి బం­ద్‌ కా­ర­ణం­గా మూ­త­బ­డ్డా­యి.  

Tags:    

Similar News