Lawyer Vaman Rao Murder Case: వామన్రావు దంపతుల హత్యతో నాకు ఎలాంటి సంబంధం లేదు : పుట్ట మధు
Lawyer Vaman Rao Murder Case : పెద్దపల్లిలో సంచలనం సృష్టించిన అడ్వకేట్ వామన్రావు దంపతుల హత్యపై జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు తొలిసారి స్పందించారు.
Lawyer Vaman Rao Murder Case : పెద్దపల్లిలో సంచలనం సృష్టించిన అడ్వకేట్ వామన్రావు దంపతుల హత్యపై జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు తొలిసారి స్పందించారు. ఈ హత్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తన మీద కొందరు కావాలనే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులను స్వేచ్ఛగా దర్యాప్తు చేసుకోనివ్వకుండా.. ముందుగానే తనను ఇందులోకి లాగుతున్నారని మధు విమర్శించారు.
తాను పార్టీ అధినేతలను కలవడానికి వెళ్లలేదని, వారు తనను పిలవలేదని చెప్పారు. అయినా కేసీఆర్, కేటీఆర్ తనకు అపాయింట్మెంట్ నిరాకరించినట్లు పుకార్లు పుట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంథని ఎమ్మెల్యేతో కలిసి కొందరు తనపై నిందలు మోపుతున్నారని, తాను మంథని మట్ట బిడ్డనని, వజ్రం లాంటి వ్యక్తినని పుట్టమధు వివరణ ఇచ్చుకున్నారు.
Also Read :
♦ భారతీయులకు బైడెన్ సర్కార్ శుభవార్త
♦ అంత్యక్రియలకు హాజరైన 33 మందికి కరోనా.. 26 మంది విద్యార్ధులకు వాంతులు, విరేచనాలు