chaysam Mothers : పరోక్షంగా 'చైసామ్' కి మద్దతిచ్చిన అమల, నినెట్టే ప్రభు..!

chaysam Mothers : మొన్నటివరకు టాలీవుడ్ లో బెస్ట్ కపుల్ గా ఉన్న అక్కినేని నాగచైతన్య, సమంత ఇప్పుడు విడిపోయారు.

Update: 2021-10-05 06:45 GMT

chaysam Mothers : :మొన్నటివరకు టాలీవుడ్ లో బెస్ట్ కపుల్ గా ఉన్న అక్కినేని నాగచైతన్య, సమంత ఇప్పుడు విడిపోయారు. ఒకే దారిలో ప్రయాణం చేద్దామని మూడేళ్ళ క్రితం మూడుముళ్ల బంధంతో ఒక్కటైన ఈ జంట.. ఇప్పుడు ఎవరి దారిని వారు వెతుక్కున్నారు. కారణాలు ఏమైనా కానీ అభిమానులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇది కల అయితే బాగుండు.. నిజాలు రూమర్స్ గా మిగిలిపోతే బాగుండు. ఇద్దరూ మళ్ళీ కలిస్తే చూడాలని ఉందంటూ అభిమానులు కోరుకుంటున్నారు. మరి వారికే ఇలా ఉంటే.. చైసామ్ ల అమ్మానాన్నలకి ఇంకెలా ఉండాలి. ఇద్దరు విడిపోవడం పట్ల వారి తండ్రులైన నాగార్జున, జోసెఫ్ లు స్పందించారు. వారి నిర్ణయాన్ని గౌరవిద్దాం... వాళ్ళకి ప్రైవసీని ఇద్దాం అంటూ పెద్దరికంతో చాలా హుందాగా వ్యవహరించారు.

పిల్లల పట్ల వారు ప్రవర్తించిన తీరు నెటిజన్లని ఆకట్టుకుంది. ఇక చైసామ్ విడిపోవడం పట్ల అటు చైతూ అమ్మ అక్కినేని అమల(పినతల్లి), సమంత అమ్మ నినెట్టే ప్రభు పరోక్షంగా స్పందించకపోయిన పూర్తిగా మద్దతు పలికారు. నాగార్జున చేసిన ట్వీట్ ని రీట్వీట్ చేస్తూ చైతూకి అమల సపోర్ట్ చేసింది.

చైతన్యకు తల్లిగా అమలే ఇప్పుడు అన్ని వ్యవహారాలు చూసుకుంటుంది. ఇక అటు విచారంలో ఉన్నప్పుడు మా అమ్మ చెప్పిన మాటలే గుర్తొస్తాయంటూ సమంత పోస్ట్ పెట్టింది.

Tags:    

Similar News