బాలయ్యను మెప్పించిన 'ఉప్పెన'

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి ఆట నుంచే మంచి టాక్ సంపాదించుకొని భారీ వసూళ్ల వైపు దూసుకెళ్తోంది.

Update: 2021-02-21 08:00 GMT

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం 'ఉప్పెన'.. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి ఆట నుంచే మంచి టాక్ సంపాదించుకొని భారీ వసూళ్ల వైపు దూసుకెళ్తోంది. ఈ మూవీలో హీరో హీరోయిన్ల నటనకి గాను పలువురు ప్రముఖుల నుంచి మంచి మార్కులు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాను హీరో బాలకృష్ణ కుటుంబ సమేతంగా వీక్షించారు. ఆయన కోసం నిర్మాతలు స్పెషల్ షోని ఏర్పాటు చేసారు. అనంతరం మూవీ అద్భుతంగా ఉందని చిత్రబృందాన్ని బాలయ్య అభినందించారు. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.


Tags:    

Similar News